న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. 56 ఏండ్ల వ్యక్తి తన భార్యను హత్యచేసి అనంతరం బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఈశాన్య ఢిల్లీలోని కరవల్ నగర్ ప్రాంతంలో వెలుగుచూసింది. కుటుంబ గొడవల కారణంగా దంపతులు ఇద్దరూ తరచూ ఘర్షణ పడేవారని పోలీసులు తెలిపారు.
కూరగాయలు విక్రయించే రాజ్ వీర్ సోమవారం ఉదయం తన భార్య సంతోషి (50)పై పదునైన ఆయుధంతో దాడి చేసి అనంతరం ఊపిరిఆడకుండా చేసి హత్య చేశాడు. ఆపై నిందితుడు తన మణికట్టు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్ధానికులు వారిద్దరినీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించారని వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.