తమిళనాడు: తమిళనాడు రాష్ట్రం వెల్లూరులో దారుణం చోటు చేసుకుంది. భార్యను భర్త నడిరోడ్డుపై దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
సోమవారం రాత్రి వెల్లూరులోని రద్దీ రహదారిపై ఓ వ్యక్తి తన భార్యను పలుమార్లు కత్తితో దారుణంగా పొడిచాడు. దీంతో ఆమె అక్కడే కుప్పకూలి మృతి చెందింది. రోడ్డుపై వెళ్తున్న ప్రజలు ఈ దారుణాన్ని చూస్తున్నారే గానీ, ఆపడానికి ఎవరూ ప్రయత్నించకపోవడం గమనార్హం. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీలో రికార్డయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
(Warning! disturbing images) Man Stabs Wife To Death On Busy Road In Tamil Nadu; Arrested. Horrific Act Caught On CCTV #VelloreStabbing pic.twitter.com/nWWuK6J9TO
— India.com (@indiacom) January 24, 2023