హైదరాబాద్, ఏప్రిల్ 27(నమస్తే తెలంగాణ): శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మకమైన 31వ యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రత్యేక అవసరాలు గల వారికి నాణ్యమైన పునరావాస సేవలందించడం కోసం నిర్విరామంగా చేస్తున్న కృషికి గుర్తింపునకు యుధ్వీర్ మె మోరియల్ ఫౌండేషన్ ఆమెను ఈ అవార్డు కోసం ఎంపికచేశారు.
ఈ నెల 30న కోఠిలోని భారతీయ విద్యాభవన్లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.