హైదరాబాద్: నగర శివార్లలోని హయత్నగర్లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. భాగ్యలత కాలనీలోని పుల్లారెడ్డి స్వీట్స్ వద్ద గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత వ్యక్తిని దుండగులు హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. తలపై బండరాయితో కొట్టడంతో అతడు చనిపోయాడని చెప్పారు. మృతుడిని దొడ్డ మధుసూధన్ రెడ్డిగా గుర్తించారు. అతడు పెయింటర్గా పనిచేస్తున్నాడని, ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాకు చెందినవాడని తెలిపారు. ఘటనాస్థలంలో మద్యం సీసాలను గుర్తించారు. ఈ హత్యపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.