న్యూఢిల్లీ : కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) మన జీవితాల్లో భాగమైంది. ఏఐ (AI) రాకతో ప్రయోజనాల సంగతి పక్కనపెడితే న్యూ టెక్నాలజీతో కొలువు కోతపై ఆందోళన వ్యక్తమవుతోంది. న్యూ టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న కేటుగాళ్లు ఏఐనీ దుర్వినియోగం చేస్తున్నారు. ప్రజల నుంచి పలు రకాల స్కామ్లు, స్కీమ్లతో దండుకున్న సైబర్ నేరగాళ్లు తాజాగా రూటు మార్చి ఏఐ ఆధారిత డీప్ఫేక్ టెక్నాలజీతో అమాయకులను అడ్డంగా దోచేస్తున్నారు.
కేరళకు చెందిన ఓ వ్యక్తిని ఏఐ ఆధారిత డీప్ఫేకింగ్ టెక్నాలజీతో నిందితులు రూ. 40,000 మోసం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోజికోడ్కు చెందిన రాధాకృష్ణన్కు గుర్తుతెలియని నెంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. కాల్లో ఇమేజ్ ఆధారంగా అతడు ఏపీలో తన మాజీ కొలీగ్లా కనిపించడంతో పాటు తమ కామన్ ఫ్రెండ్స్ పేర్లను కూడా ప్రస్తావించడంతో స్కామర్ను బాధితుడు నమ్మాడు. ఇది జెన్యూన్ కాల్ అనుకుని అతడితో వీడియో కాల్ కొనసాగించాడు.
కొద్దిసేపు మాట్లాడిన అనంతరం తమ బంధువు ఆస్పత్రిలో ఉన్నాడని నమ్మబలికిన నిందితుడు రూ. 40,000 ఇవ్వాలని కోరాడు. స్నేహితుడికి సాయం చేయాలని భావించిన బాధితుడు ఆ మొత్తాన్ని ఆన్లైన్లో పంపాడు. ఇక మరికాసేపట్లో అదే వ్యక్తి రూ. 35,000 పంపాలని కోరడంతో అనుమానం వచ్చిన రాధాకృష్ణన్ తన మాజీ కొలీగ్ను సంప్రదించాడు. ఆపై తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :
Tamil Nadu | మనీలాండరింగ్ కేసులో మరో తమిళ మంత్రి ఇంటిపై ఈడీ దాడులు..