న్యూఢిల్లీ : ఆన్లైన్లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నిఘా నేత్రాల కండ్లు గప్పి అమాయకుల నుంచి అందినకాడికి దోచేస్తున్నారు. తాజాగా ఢిల్లీలోని గితోర్ని ప్రాంతంలో ఇన్స్టాగ్రాంలో ఐఫోన్ (iPhone) కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తి నుంచి రూ. 29 లక్షలు స్వాహా చేశారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా గుర్తుతెలియని దుండగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు రోజుల కిందట బాధితుడు ఇన్స్టాగ్రాం పేజ్ను సందర్శించగా అక్కడ ఐఫోన్లను భారీ డిస్కౌంట్లపై విక్రయించే ప్రకటనకు ఆకర్షితుడయ్యాడు.
అతి తక్కువ ధరలకు ఐఫోన్లు అందుబాటులో ఉండటంతో వాటిని కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యానని ఫిర్యాదుదారు వికాస్ కతియార్ చెప్పాడు. తాను పేజ్ సరైందేనని ఇతర కొనుగోలుదారులతో మాట్లాడి నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి ఫోన్ కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు. ఆపై ఫిబ్రవరి 6న ఐఫోన్ను కొనుగోలు చేసేందుకు ఓ మొబైల్ నెంబర్కు కతియార్ కాల్ చేశాడు. ఆపై వారు ఫోన్ కోసం రూ. 28,000 అడ్వాన్స్ చెల్లించాలని కోరారు.
అడ్వాన్స్ మొత్తం చెల్లించిన తర్వాత వివిధ ఫోన్ నెంబర్ల నుంచి కస్టమక్స్ ఇతర పన్నులను క్లియర్ చేసేందుకు అదనపు సొమ్ము చెల్లించాలని వసూలు చేశారు. ఐఫోన్ కోసం మొత్తం వివిధ ఖాతాలకు రూ. 29 లక్షలు చెల్లించానని, తనకు ఫోన్తో పాటు ఈ మొత్తం కూడా రిఫండ్ వస్తాయని ఆశిస్తున్నానని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడు వికాస్ కతియార్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :