మెదక్ : ఎదురెదురుగా వచ్చి రెండు బైకులు ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన రామయంపేట పట్టణంలోని పాత జాతీయ రహదారిపై సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన మన్నె ప్రవీణ్(35) తన స్వగ్రామం నుంచి రామాయాంపేటకు బైక్పై వస్తుండగా.. ఎదురుగా వస్తున్న మరో బైక్ను అదుపుతప్పి ఢీ కొట్టాడు.
ఈ ప్రమాదంలో మన్నె ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బాదిత కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.