వడోదర : అమెరికాలోని జార్జియా స్టేట్లో దారుణం జరిగింది. గుజరాత్కు చెందిన ఎన్ఆర్ఐని సాయుధ దుండగుడు బ్యూనావిస్టా రోడ్డులోని సినోవస్ బ్యాంక్ వెలుపల సోమవారం రాత్రి కాల్చిచంపాడు. మృతుడిని గుజరాత్లోని ఖేడా జిల్లాకు చెందిన అమిత్ పటేల్ (45)గా గుర్తించారు. అమిత్ పటేల్ వద్దనున్న డబ్బును గుంజుకున్న నిందితుడు అతడిపై అతిదగ్గరగా కాల్పులు జరిపి పరారయ్యాడు.
ఈ ఘటనపై అమెరికా పోలీసులు దోపిడీ కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. డబ్బు డిపాజిట్ చేసేందుకు బ్యాంకుకు వెళుతున్న పటేల్ను అడ్డగించిన దుండగుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. బ్యూనావిస్టా రోడ్డు వద్ద పటేల్కు గ్యాస్ స్టేషన్ ఉందని గుర్తించారు. పటేల్ కుటుంబం వారి కూతురి మూడవ పుట్టినరోజు వేడుకలకు సిద్ధమవుతుండగా ఈ దుర్ఘటన జరగడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. పటేల్ ఘటనా స్ధలంలోనే మరణించాడని పోలీసులు తెలిపారు