నల్లగొండ : కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగుల మందుతాగి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్లగొండ మండలం నర్సింగ్బట్ల గ్రామానికి చెందిన కందుల నర్సింహ (36)కు అతడి భార్యకు మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆమె ఇటీవల పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నర్సింహ ఇవాళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. కాసేపటికి గుర్తించిన తల్లి స్థానికుల సాయంతో చికిత్స నిమిత్తం నల్లగొండ జిల్లా కేంద్ర దవాఖానకు తీసుకెళ్లింది. అక్కడ చికిత్స పొందుతూ నర్సింహ మృతి చెందాడు. తల్లి జయమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.