అశ్వారావుపేట : ఆర్థిక సమస్యలు కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అశ్వారావుపేటలో చోటుచేసుకుంది. స్థానికులు తెలలిపిన వివరాలు ప్రకారం పట్టణంలోని దండాబత్తుల బజార్ నివాసి జూజం సత్యనారాయణ(45) గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.దీనికి తోడు ఆర్థిక సమస్యలు కూడా తోడవ్వడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహానికి పంచనామనిర్వహించి, కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.