అహ్మదాబాద్ : వీఐపీ మొబైల్ నెంబర్ మోజుతో ఓ వ్యక్తి రూ 1.43 కోట్లు మోసపోయిన ఘటన అహ్మదాబాద్లో వెలుగుచూసింది. బాధితుడిని గత రెండేండ్లుగా మోసగిస్తున్న నిందితుడు నవ వదజ్ ప్రాంతానికి చెందిన ధ్రువిల్ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బాధితుడి మొబైల్ ఫోన్ కనెక్షన్కు వీఐపీ నెంబర్ ఇప్పిస్తానని నిందితుడు మోసగించాడు.
దీనికోసం ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని బాధితుడిని కోరాడు. వీఐపీ నెంబర్ పేరుతో గత రెండేండ్లుగా ధ్రువిల్ రూ. రెండు కోట్లు రాబట్టాడు. మొబైల్ నెంబర్తో ఇన్వాయిస్ను కూడా ఇచ్చిన నిందితుడు సిమ్ కార్డు త్వరలో వస్తుందని నమ్మబలికాడు. సిమ్ కార్డు ఎంతకీ రాకపోవడంతో బాధితుడు సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేయగా ధ్రువిల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో భాగంగా నిందితుడి బ్యాంక్ ఖాతాను పరిశీలించిన పోలీసులు రూ 1.4 కోట్లను స్వాధీనం చేసుకున్నారు.