మెదక్ : గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన హవేళీఘనపూర్ మండల పరిధిలోని బూర్గుపల్లి శివారులో బుధవారం ఉదయం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పొల్కంపేటకు చెందిన గడ్డి హన్మంతు(26)ను గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి బూర్గుపల్లి అటవీ ప్రాంతంలోని ఓ బండపై దారుణంగా హత్య చేసినట్లు తెలిపారు. సంఘటన స్థలాన్ని మెదక్ రూరల్ సీఐ పాలవెల్లి, ఎస్ఐ శేఖర్రెడ్డి సందర్శించి క్లూస్టీమ్ రప్పించి ఆధారాలు సేకరించారు. మృతుడిని ఎవరు హత్య చేశారు..? ఎందుకు హత్య చేశారనే విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచారయత్నం కేసు
దారుణం : రైల్వే ట్రాక్పై యువతి మృతదేహం
Road accident |బొలెరో వాహనం బోల్తా..పది మందికి గాయాలు