న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఒక ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడో నీచుడు. ఢిల్లీలోని రంజిత్ నగర్లో ఈ ఘోరం వెలుగు చూసింది. బాలికపై అఘాయిత్యం జరిగిందని తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. వాటిలో ఒక దానిలో నిందితుడిని అనుసరిస్తున్న బాలిక కనిపించింది.
ఈ ఆధారంతో నిందితుడి కోసం జల్లెడ పట్టిన పోలీసులు హర్యానాలో అతను ఉన్నట్లు తెలుసుకున్నారు. అక్కడకు వెళ్లి అతన్ని అరెస్టు చేశారు. బాలికతోగానీ, ఆమె కుటుంబంతోగానీ నిందితుడికి పరిచయం లేదని దర్యాప్తులో తేలింది. గతంలో కూడా ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడు అరెస్టయినట్లు సమాచారం.