పెద్దపల్లి : నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి మీడియాకు వివరాలను వెల్లడించారు. పెద్దపల్లి సబ్ డివిజన్ పరిధిలో ఉద్యోగాలు ఇప్పిస్తానని అరుణ్ అనే వ్యక్తి పలువురి వద్ద డబ్బులు తీసుకొని మోసగించాడన్నారు.
బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు. ఎవరు కూడా బ్రోకర్లను నమ్మి మోసపోవద్దని ఏసీపీ సూచించారు. సమావేశంలో సీఐ ప్రదీప్ కుమార్, ఆర్.ఎస్.ఐ రాజేష్ ఉన్నారు.