న్యూఢిల్లీ : మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో (Mahadev Betting App Case) ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు, యాప్ యజమాని రవి ఉప్పల్ను దుబాయ్లో అరెస్ట్ చేశారు. ఇంటర్పోల్ ద్వారా రవి ఉప్పల్కు వ్యతిరేకంగా ఈడీ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయడంతో దుబాయ్లో స్ధానిక అధికారులు ఆయనను నిర్భందించారు. గతవారం రవి ఉప్పల్ను దుబాయ్లో నిర్భందంలోకి తీసుకోగా ఆయనను భారత్కు తరలించేందుకు యూఏఈ అధికారులతో ఈడీ ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతున్నారు.
రవి ఉప్పల్తో పాటు మరో ప్రమోటర్ సౌరవ్ చంద్రార్కర్పైనా ఈడీ దర్యాప్తు సాగిస్తోంది. రవి ఉప్పల్పై కేసులను ముంబై పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. యూఏఈ ప్రధాన కార్యాలయం కేంద్రంగా మహదేవ్ బెట్టింగ్ ప్లాట్ఫాంను వాడుతూ ఉప్పల్ సహా ఇతర నిందితులు మనీ ల్యాండరింగ్, హవాలా లావాదేవీలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి.
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో రూ. 6000 కోట్ల వరకూ అవకతవకలు జరిగాయి. ఫ్రాంచైజీలు, బ్రాంచ్లు, నెట్వర్క్ ద్వారా యాప్ పేరుతో నిందితులు రోజుకు రూ. 200 కోట్లు దండుకున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఏడాది అక్టోబర్లో చత్తీస్ఘఢ్లోని రాయ్పూర్ కోర్టులో స్పెషల్ పీఎంఎల్ఏ కోర్టులో దాఖలైన కేసు ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది.
Read More :
Mohan Yadav | మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణం