భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం నెహ్రూనగర్లో విషాదం నెలకొంది. ఓ ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రియురాలు ప్రాణాలు కోల్పోగా, ప్రియుడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. మృతురాలిని బోడ శ్వేత(20)గా గుర్తించారు. శ్వేత డిగ్రీ చదువుతోంది. గుగులోత్ వెంకటేశ్, శ్వేత గత కొన్నేండ్ల నుంచి ప్రేమించుకుంటున్నట్లు తెలిసింది. మృతురాలి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.