ములుగు : గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో న్యాయవాది దారుణ హత్యకు గురయ్యాడు. ములుగు జిల్లా కేంద్రం నుంచి మల్లంపల్లి వైపునకు తన సొంత వాహనంలో వెళ్తుండగా జాతీయ రహదారి పందికుంట స్టేజీ వద్ద మాటువేశారు. స్విఫ్ట్ కారులో వచ్చిన ఐదుగురు మల్లారెడ్డి వెళ్తున్న ఇన్నోవా కారును అటకాయించారు. ఆ తర్వాత డ్రైవర్ను చితకబాది, ఆ తర్వాత కత్తులు, గొడ్డళ్లతో మల్లారెడ్డిపై విచక్షణారహితంగా దాడి చేశారు.
ఆ తర్వాత అక్కడికి నుంచి పారిపోయాడని డ్రైవర్ తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మల్లారెడ్డి వృత్తిరీత్యా న్యాయవాది కాగా.. ఆయన మైనింగ్ వ్యాపారం సైతం నిర్వహిస్తున్నారు. అలాగే ములుగు మండలం మల్లంపల్ల గ్రామంలో పెట్రోల్ పంపు సైతం ఉన్నది. అయితే, హత్యకు గల కారణాలు తెలియరాలేదు.