Mobile Phone Explodes | కేరళ (Kerala) రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. మొబైల్ ఫోన్ పేలి (Mobile Phone Explodes) ఎనిమిదేండ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
త్రిస్సూర్ (Thrissur) జిల్లాలోని తిరువిల్వామల (Thiruvilvamala)కు చెందిన ఆదిత్య శ్రీ (8) (Adithyasree) అనే చిన్నారి 3వ తరగతి చదువుతోంది. సోమవారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో మొబైల్ ఫోన్ (Mobile Phone) లో వీడియో గేమ్స్ ఆడుతూ కూర్చుంది. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి.. మొబైల్ హీటెక్కినా గేమ్స్ ఆడటం ఆపలేదు. ఛార్జింగ్ పెట్టి మరీ గేమ్స్ ఆడుతుండగా అది ఒక్కసారిగా చిన్నారి ముఖంపై పేలిపోయింది. ఈ ఘటనలో ఆదిత్యశ్రీకి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పజ్యన్నూర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మొబైల్ ఫోన్ పేలడానికి (Mobile Phone Explodes) గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
Also Read..
Sudan Crisis | సుడాన్లో 72 గంటలపాటు కాల్పుల విరమణ.. అంగీకరించిన ఇరువర్గాల జనరల్స్
Another Pee-Gate | విమానంలో ప్రయాణికుడిపై మూత్ర విసర్జన
Anand Mahindra | కృత్రిమ మేధతో ముప్పు..? ఆనంద్ మహీంద్రా స్పందన ఏంటంటే..