Another Pee-Gate | విమానంలో మద్యం మత్తులో తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన (Pee-Gate) చేసిన సంఘటనలు గత కొన్ని రోజులుగా తరచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది.
న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీ ( New York to Delhi ) వస్తున్న అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం (American Airlines flight) లో ఆదివారం ఓ భారతీయ ప్రయాణికుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. మద్యం తాగి తోటి ప్రయాణికుడి (co-passenger ) తో వాగ్వాదానికి దిగాడు. అనంతరం అతడిపై మూత్రం (urinated ) పోశాడు. ఈ విషయాన్ని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విమానం ఢిల్లీలో దిగగానే నిందితుడిని సీఐఎస్ఎఫ్ పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు. సివిల్ ఏవియేషన్ చట్టం (Civil Aviation ) కింద నిందితుడిపై తగిన చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
న్యూయార్క్ జెఫ్ ఎఫ్.కెన్నడీ అంతర్జాతీయ విమాశ్రయం (JKF) నుంచి న్యూఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (DEL)కు వచ్చిన విమానం ఏఏ 292లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అమెరికన్ ఎయిర్లైన్స్ పేర్కొంది. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఈ విమానం ఢిల్లీకి చేరుకుందని, పీయింగ్ ఘటనను ల్యాండింగ్కు ముందే ఢిల్లీ విమానాశ్రయ సిబ్బందికి అమెరికన్ ఎయిర్లైన్స్ ఉద్యోగులు సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. కాగా, అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలో రెండు నెలల్లో ఇది రెండో ఘటన కావడం గమనార్హం.
గత నెలలో అమెరికా యూనివర్సిటీలో చదువుతున్న భారత్కు చెందిన ఆర్య వోహ్రా అనే 21 ఏండ్ల విద్యార్థి మద్యం మత్తులో సహ ప్రయాణికుడిపై మూత్రం పోశాడు. ఈ ఘటన న్యూ యార్క్ నుంచి ఢిల్లీ వచ్చిన అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలో చోటు చేసుకుంది. ఈ ఘటన తర్వాత ఆర్యా వోహ్రా అనే ఆ వ్యక్తిపై అమెరికన్ ఎయిర్లైన్స్ బ్యాన్ విధించింది. అంతేకాదు, గత నవంబర్లోనూ ఎయిర్ ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్లో ప్రయాణిస్తున్న ఓ మహిళపై తాగిన మత్తులో శంకర్ మిశ్రా అనే వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటన తెలిసిందే. తాజా ఘటనతో విమానంలో మూత్ర విసర్జన ఘటన చోటుచేసుకోవడం ఇది మూడోది.
Also Read..
Anand Mahindra | కృతిమ మేధతో ముప్పు..? ఆనంద్ మహీంద్రా స్పందన ఏంటంటే..
India Corona | భారీగా తగ్గిన కొవిడ్ కేసులు