నిజామాబాద్ : కష్టాల కడగండ్లను దాటుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరాలని, పట్టుదలనే పెట్టుబడిగా మార్చుకుంటూ లక్ష్యాలను చేరుకోవాలంటూ స్ఫూర్తినిచ్చే మాటలతో ఆయన ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. తన ప్రసంగాలు, రచనల ద్వారా జీవితంలో కష్ట సుఖాలను సమానంగా స్వీకరించి ఎదురొడ్డి నిలువాని ప్రేరణ కల్పించాడు.
ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన తనే చివరికి చివరికి అర్ధాంతరంగా తనువు చాలించాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు కాసాల జైపాల్ రెడ్డి బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. సోమవారం ఉదయం తన నివాసం నుంచి నిజాం సాగర్ ప్రాజెక్టు వద్దకు వెళ్లిన ఆయన అందులో దూకి మృతి చెందారు.
రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా జైపాల్ రెడ్డి అనేక మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. సుమారుగా ఎనిమిది వేల సదస్సులు నిర్వహించారు. సామాజిక మాధ్యమం వేదికగా చేసుకొని అవగాహన కార్యక్రమాలను సైతం చేపట్టారు. తన రచనల ద్వారా అవగాహన కల్పించారు.
ఆరోగ్య సమస్యలు చుట్టు ముట్టడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఫేస్ బుక్లో పోస్ట్ పెట్టి చనిపోయాడు. జైపాల్ రెడ్డి స్వగ్రామం కామారెడ్డి జిల్లా పిట్లం మండలం అల్లాపూర్ గ్రామం. జైపాల్రెడ్డి మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.