న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దారుణం వెలుగుచూసింది. సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖలో సైంటిస్ట్గా పనిచేస్తున్న వ్యక్తి సోమవారం శాస్త్రి భవన్ ఏడో ఫ్లోర్ నుంచి కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడిని పీరాగర్హికి చెందిన 55 ఏండ్ల రాకేష్ మాలిక్గా గుర్తించారు.
శాస్త్రిభవన్ కంట్రోల్ రూం నుంచి సమాచారం రావడంతో ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు బాధితుడి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రాకేష్ మాలిక్ మృతికి కారణాలేమిటనేది ప్రాధమిక దర్యాప్తు అనంతరం వెల్లడవుతాయని అధికారులు పేర్కొన్నారు.