వెంగళరావునగర్ : పబ్జీగేమ్ ద్వార పరిచమైన ఓ యువకుడు, యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి రూ.2.50 లక్షల డబ్బును స్వాహా చేశాడు. ఎస్.ఆర్నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాల ఇన్స్పెక్టర్ సైదులు కథనం మేరకు..బోరబండ సైట్-3కి చెందిన యువతి (25) 2019 నుంచి సెల్ఫోన్లో పబ్జీ గేమ్స్ ఆడుతుండేది.
ఈ ఆటలో మహ్మద్ అబ్దుల్లా ఫైసల్ అనే యువకుడు పరిచయమయ్యాడు. తనది కరీంనగర్ జిల్లా ఖానాపూర్గా చెప్పు కున్నాడు. పరిచయం పెంచుకుని తరచూ నగరానికి వచ్చి యువతిని కలుస్తుండేవాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి యువతి తల్లిదండ్రులను కూడా పరిచయం చేసుకున్నాడు.
కాగా తనకు అవసరం ఉందని పలు మార్లు యువతి వద్ద నుంచి మొత్తం రూ.2.50 లక్షలను తీసుకున్నాడు. పెళ్లి చేసుకుందామని యువతి బలవంతం పెట్టడంతో తప్పించుకుని తిరగసాగాడు.
యువతి, ఆమె కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లను బ్లాక్ చేసి కనిపించకుండా పోవడంతో బాధితురాలు మోసపోయానని గ్రహించి ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.