మణికొండ : రోడ్డుపై అతివేగంగా వెళ్తున్న ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో పాదచారుడు తీవ్రంగా గాయపడిన ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి… నార్సింగి గ్రామానికి చెందిన అనిల్కుమార్ అనే వ్యక్తి కోకాపేట నుంచి గండిపేట వైపు వెళ్తుండగా రాజపుష్పా సమీపంలో వెనుక నుంచి వచ్చిన ఎపీ 9బీడబ్ల్యూ7510 నెంబరు గల మారుతి రిట్జ్ కారు అతివేగంగా వచ్చి అనిల్ను ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో భాధితుడు కారు రెండు చక్రాల మధ్యలో ఇరుక్కుపోయాడు. విషయం గమనించిన స్థానికులు కారును ఆపి గాయపడిన అనిల్ను ఆసుపత్రికి తరలించి నార్సింగి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కారు డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నార్సింగి పోలీసులు తెలిపారు.