హైదరాబాద్ : నగరంలోని అంబర్పేటలో అమానుషం చోటు చేసుకుంది. అంబర్పేట పోలీసు స్టేషన్కు సమీపంలో ఉన్న చెత్త కుండీలో అప్పుడే పుట్టిన శిశువును గుర్తు తెలియని వ్యక్తులు కవర్లో చుట్టి వదిలేసి వెళ్లిపోయారు. ఇవాళ ఉదయం చెత్త తీసేందుకు వెళ్లిన పారిశుద్ధ్య కార్మికులకు శిశువు మృతదేహం కనిపించింది. దీంతో కార్మికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.