షాద్నగర్రూరల్ : మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవనే విషయాన్ని అందరూ గ్రహించాలని షాద్నగర్ ట్రాఫిక్ ఎస్ఐ రఘుకుమార్ అన్నారు. గురువారం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 12మందిని కోర్టులో హాజరు పరుచగా సెకండ్ క్లాస్ జడ్జి మురళీ అందరికి జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.
ఇందులో ఆరుగురికి మూడ్రోజులు, మిగత వారికి నాలుగు రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. షాద్నగర్ పట్టణంలో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఎవరైనా మద్యం సేవించి వాహనాన్ని నడిపితే శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు 6నెలల పాటు వారి డ్రైవింగ్ లైసెన్స్ను రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.