ఐజ్వాల్ : మిజోరంలో భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ రాష్ట్ర రాజధాని ఐజ్వాల్కు సమీపంలో 5 లక్షల మెథాంఫిటామైన్ అనే డ్రగ్స్ను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ డ్రగ్స్ విలువ రూ. 10 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. అసోం నుంచి డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు.. మంతు కుమార్ దేవ్ (45), సుభాష్ దాస్ (33)ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నార్కొటిక్ డ్రగ్స్ అధికారులు విచారణ చేస్తున్నారు.