లక్నో : యూపీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వద్ద పోస్టింగ్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ దారుణ హత్యకు గురైన ఉదంతం కలకలం రేపింది. బిజ్నోర్ జిల్లాకు చెందిన మహిళా కానిస్టేబుల్ ప్రతాప్ఘఢ్ జిల్లా రాణిగంజ్ తహసిల్దార్తో వివాహేతర సంబంధం కలిగిఉందని వెల్లడైంది. మృతురాలిని రుచిసింగ్గా గుర్తించిన పోలీసులు హత్య కేసుకు సంబంధించి రాణిగంజ్ తహసిల్దార్తో పాటు ఆయన భార్యను అదుపులోకి తీసుకున్నారు.
మృతురాలితో తనకు వివాహేతర సంబంధం ఉందని, తనను పెండ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేస్తుండటంతోనే మహిళా కానిస్టేబుల్ను హత్య చేశానని నిందితుడు పోలీసులకు వివరించాడు. మహిళా కానిస్టేబుల్ను హత్య చేసిన అనంతరం నిందితుడు ఆమె మృతదేహాన్ని కాలువలో పడేశాడు. గత వారం రోజులుగా కనిపించకుండా పోయిన రుచిసింగ్ విగతజీవిగా కాలవలో పడిఉండటం కలకలం రేపింది.
పోలీస్ హెడ్క్వార్టర్స్కు ముందు ఆమె బారాబంకి జిల్లాలోని అసంద్ర పోలీస్ స్టేషన్లో పనిచేశారు. రుచి అర్జున్గంజ్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో నివసిస్తోందని అదనపు డీసీపీ ఖాసిం అబ్ధి తెలిపారు. ఫిబ్రవరి 13న ఆమె డ్యూటీకి రావాల్సి ఉండగా విధులకు మాజరు కాలేదు ఆపై ఆమెను గుర్తించేందుకు దర్యాప్తును వేగవంతం చేశామని చెప్పారు.