భోపాల్ : మధ్యప్రదేశ్లో దారుణం వెలుగుచూసింది. సాగర్ జిల్లాలో గురువారం రాత్రి 20 ఏండ్ల యువతిపై ఇద్దరు మైనర్లు సహా నలుగురు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. యువతి తన బావతో కలిసి బైక్పై వెళుతుండగా అడ్డగించిన నిందితులు రాంపురాలోని అటవీ ప్రాంతంలో ఈ దారుణానికి తెగబడ్డారు.
బాలిక బావను కొట్టిన నిందితులు యువతిని అపహరించారు. ఆమెను సమీప అటవీ ప్రాంతానికి బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి బావ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని రక్షించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పారిపోయిన ఇతర నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నామని సాగర్ ఎస్పీ తరుణ్ నాయక్ తెలిపారు. దోషులపై కఠిన చర్యలు చేపడతామని చెప్పారు.