బంజారాహిల్స్ : గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రహ్మత్నగర్ సమీపంలోని శివమ్మపాపిరెడ్డి హిల్స్లో నివాసం ఉంటున్న కందుల కొండయ్య (52) కూలీపనులు చేస్తుంటాడు.
గత కొంతకాలంగా కొండయ్య తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఎన్నిమందులు తిన్నా ఫలితం లేకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయిన కొండయ్య ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు మృతుడి కొడుకు విజయ్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.