వేంసూరు:మండలంలో అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే, ట్రాక్టర్లను సీజ్ చేయడంతో పాటు యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తహసీల్దార్ ఎండీ.ముజాహిద్ తెలిపారు. మండలపరిధిలోని దుద్దేపూడి గ్రామానికి చెందిన కంచర్ల రాజా ఇసుక అక్రమంగా రవాణా చేస్తుండగా రెవిన్యూ ఇన్స్పెక్టర్ హరిప్రసాద్ పట్టుకున్నట్లు తహసీల్దార్ తెలిపారు.
సీజ్ చేసిన ట్రాక్టర్ యజమానికి రూ.5వేల జరిమానా విధించడం జరిగిందని చెప్పారు. ఇసుక, మట్టి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తే అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.