హైదరాబాద్ శివారులోని విజయవాడ జాతీయ రహదారి పక్కన చెట్ల పొదల్లో కుళ్లిన జంట మృతదేహాలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. యువకుడి మర్మాంగాన్ని ఛిద్రం చేసి, యువతిని రాళ్లతో మోది హతమార్చిన దారుణం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలోని కొత్తగూడెం బ్రిడ్జి వద్ద మంగళవారం వెలుగులోకి వచ్చిన విషయం విదితమే.
నగరంలోని వారాసిగూడకు చెందిన ఎడ్ల యశ్వంత్(22) క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మెట్టుగూడకు చెందిన ఓ వివాహిత జ్యోతికి(28) భర్త, ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. అయితే యశ్వంత్, జ్యోతి మధ్య గత కొంతకాలం నుంచి వివాహేతర సంబంధం కొనసాగుతోంది.
ఈ జంట హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతురాలి భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వివాహేతర సంబంధమే జంట హత్యలకు దారి తీసినట్లు పోలీసుల విచారణలో తేలింది. మృతురాలి జ్యోతిని ఆమె భర్తే హత్య చేసినట్లు నిర్ధారించారు. యశ్వంత్, జ్యోతి కలిసి బైక్పై వెళ్తుండగా.. వారిని ఆమె భర్త ఫాలో అయ్యాడు. కొత్తగూడ వద్ద ఇద్దరు కలిసి ఉండటాన్ని గమనించిన భర్త.. వారిపై దాడి చేశాడు. జ్యోతి తలపై రాయితో మోది హత్య చేయగా, జశ్వంత్ను స్క్రూ డ్రైవర్తో పొడిచి చంపాడు. హత్య అనంతరం ఘటనాస్థలి నుంచి జ్యోతి భర్త పారిపోయినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఘటనాస్థలిలో లభ్యమైన హోండా యాక్టివా నంబర్ – టీఎస్ 10 ఎఫ్బీ 2384.