హైదరాబాద్ : ములుగు జిల్లా ఏటూరు నాగారంలోని తీగలవాయి కాలనీలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై భర్త పెట్రోల్ పోసి నిప్పంటించడంతో తీవ్రగాయాలై ప్రాణాలు కోల్పోయింది. తీగలవాయి కాలనీకి చెందిన దంపతులు శిరీష, ప్రవీణ్లకు మధ్య బుధవారం గొడవ జరిగింది. దీంతో విచక్షణ కోల్పోయిన భర్త ప్రవీణ్ భార్య శిరీషపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బాధితురాలు కేకలు విని స్థానికులు మంటలు ఆర్పి చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శిరీష మృతి చెందింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ప్రవీణ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.