కరీంనగర్ : కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త చేతిలో భార్యతోపాటు ఆమె తండ్రి దారుణ హత్యకు గురయ్యారు. శ్రీనివాసనగర్ గ్రామ శివారులోని గుట్టల సమీపంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. శ్రీనివాస నగర్కు చెందిన శారద, రమేశ్ భార్యాభర్తలు. కుటుంబ కలహాల నేపథ్యంలో శారద తండ్రి ఓదెలుతో కలిసి ఈ సాయంత్రం పోలీస్ స్టేషన్కు వెళ్లి మాట్లాడి ఆటోలో తిరిగి వస్తున్నది. ఈ క్రమంలో మార్గమధ్యలో ఆటోను అడ్డుకున్న భర్త రమేశ్ అతడి సోదరుడు అనిల్ శారదతోపాటు ఆమె తండ్రిని నరికి హతమార్చారు. అనంతరం నిందితులిద్దరూ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. పోలీసులు, క్లూస్ టీం ఘటనాస్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మానకొండూరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.