కామారెడ్డి టౌన్ : కుటుంబ కలహాలు, ఆర్థిక గోడవలతో భార్య,భర్తలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. పట్టణ సీఐ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని గోసంగి కాలనికి చెందిన పోచవ్వ(42), ఆమె భర్త సాయిలు(45) బుధవారం రూ. 6వేల కోసం గొడవ పడ్డారు. ఇద్దరి మధ్య ఘర్షణ పెరిగి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయారు. అప్పటి నుంచి వీరి కుటుంబ సభ్యులు వెతికినా జాడ కనిపించలేదు.
ఆదివారం ఇద్దరి మృతదేహలు చర్చి గ్రౌండ్లోని నిర్మానుష్య ప్రాంతంలో పడి ఉండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను గుర్తించారు. సాయిలు నిప్పు అంటించుకుని ఆత్మహత్యకు పాల్పడగా అతని సమీపంలోనే భార్య పోచవ్వ కూడా నీటి కుంటలో పడిఆత్మహత్యకు పాల్పడింది. పోచవ్వ అక్క లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.