పెద్దపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు కరోనాతో మృతి చెందారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. గత వారం రోజుల క్రితం భర్త కుడికల్ల మల్లేష్ కరోనాతో కరీంనగర్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేరి చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం మృతి చెందాడు. నాలుగు రోజుల క్రితం భార్య సృజన కరోనాతో అదే దవాఖానలో చేరగా ఆమె గురువారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో గ్రామాలో వారి కుటుంబంలో విషాదం అలుముకుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనాతో మేడారం పూజారి సమ్మారావు మృతి
ఆకతాయిలను ఐసోలేషన్కు పంపించిన పోలీసులు
రైతులకు పనిముట్లను అందజేసిన మంత్రి అల్లోల
లాక్ డౌన్ కేసులు 11,746 : ఎస్పీ వెంకటేశ్వర్లు