ముంబై : నవీ ముంబైలో దారుణం జరిగింది. ఓ ట్యాంకర్ డ్రైవర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టాడనే ఆగ్రహంతో హెచ్పీసీఎల్ ఉద్యోగిపై నలుగురు వ్యక్తులు దాడికి తెగబడ్డారు. కార్యాలయంలోనే కత్తితో దాడిచేయడంతో పాటు బాధితుడిని ఇనుప రాడ్తో కొట్టారు.
గురువారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో కార్యాలయంలోకి వచ్చిన నిందితులు మేనేజర్పై ఇనుప రాడ్తో దాడి చేసి కత్తితో పొడిచారని పోలీసులు తెలిపారు. నిందితులు సాగర్ యాదవ్, ప్రదీప్ యాదవ్, బోలు యాదవ్, రోహిత్ యాదవ్లపై కేసు నమోదు చేసిన పోలీసులు రోహిత్ యాదవ్ను అదుపులోకి తీసుకున్నారు.
గాయపడిన హెచ్పీసీఎల్ ఉద్యోగిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. లాజిస్టిక్స్ కంపెనీకి చెందిన ట్యాంకర్ డ్రైవర్ సాగర్ యాదవ్ను హెచ్పీసీఎల్ బ్లాక్ లిస్ట్లో పెట్టడంతో నిందితుడు ఆగ్రహంతో ఈ దాడికి తెగబడ్డాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :
IIT-BHU: విద్యార్థిని కిస్ చేసి, దుస్తులు చింపేశారు.. బనారస్ వర్సిటీలో ఆందోళన