జగిత్యాల : జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సారంగాపూర్ మండలం రేచపల్లిలో ఎల్లమ్మ చెట్లతీర్థాలకు వెళ్లిన గ్రామస్తులపై తేనెటీగలు దాడి చేశాయి. తేనెటీగల దాడిలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. మరో 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అస్వస్థతకు గురైన వారిని చికిత్స నిమిత్తం జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.