నిజామాబాద్ : బీజేపీ నాయకులు నన్ను లైంగికంగా వేధిస్తున్నారని ఓ మహిళ నిజామాబాద్లోని 4 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బీజేవైఎం రాష్ట్ర నాయకులు పటేల్ ప్రసాద్, పిట్ల స్వామి, పుల్ల సత్యనారాయణపై బాధిత మహిళ ఫిర్యాదు చేసింది.
విశ్వహిందు పరిషత్ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న తనని లైంగికంగా వేధిస్తున్నారు.తన ఇంటి పై దాడికి వచ్చారని, ఆ ముగ్గురితో నాకు ప్రాణభయం ఉంది. వారి నుంచి నన్ను, నా కుటుంబాన్ని కాపాడాలని సదరు మహిళ పోలీసులను వేడుకుంది.