హైదరాబాద్: దుబాయ్ నుంచి వస్తున్న ముగ్గురు ప్రయాణికులు బంగారం స్మగ్లింగ్ (Gold Smuggling) చేస్తూ శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కారు. వీరి నుంచి మొత్తం 7.3 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. వీళ్లు ఈ బంగారాన్ని పాయువులో దాచుకొని తీసుకొస్తున్నారని అధికారులు తెలిపారు.
బంగారం బిస్కెట్లు, పేస్టు రూపంలో దాచుకున్నట్లు చెప్పారు. ఈ బంగారం విలువ మార్కెట్లో సుమారు రూ.3.6 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.