హైదరాబాద్ : శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తుండగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు నుంచి 704 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. సదరు వ్యక్తి పేస్ట్రూపంలో బంగారాన్ని తరలిస్తుండగా అనుమానంతో తనిఖీలు నిర్వహించగా.. బంగారం దొరికింది. స్వాధీనం చేసుకున్న గోల్డ్ విలువ రూ.40లక్షల విలువ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.