హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో శనివారం మధ్యాహ్నం భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద భారీగా బంగారం గుర్తించారు కస్టమ్స్ అధికారులు. రూ. 1.38 కోట్ల విలువైన 2.961 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం శంషాబాద్ పోలీసులకు అతన్ని అప్పగించారు.