హైదరాబాద్ : సికింద్రాబాద్లో సోమవారం రాత్రి దారి దోపిడీ ఘటన కలకలం సృష్టించింది. సిటీ లైట్ హోటల్ సమీపంలో నడుచుకుంటూ పవన్ అనే వ్యక్తిపై ఓ దుండగుడు దాడి చేశాడు. నడుచుకుంటూ వెళ్తున్న పవన్పై దుండగుడు కంట్లో కారం కొట్టి కత్తితో పొడిచాడు. ఆ తర్వాత అతని వద్ద నుంచి 14 తులాల బంగారు ఆభరణాలు తీసుకొని ఉడాయించాడు. పవన్ హిమాయత్నగర్లోని రాధే జువెల్లర్స్ నుంచి పవన్ బంగారం తీసుకొని సికింద్రాబాద్కు బయలుదేరాడు. ఈక్రమంలో సిటీలైట్ హోటల్కు సమీపంలో దుండగుడు దాడికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పవన్ను గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.