ముంబై: ఒక వ్యక్తి మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె గర్భం దాల్చడంతో శనివారం ఆత్మహత్య చేసుకుంది. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా దర్యపూర్లో ఈ దారుణం జరిగింది. 17 ఏండ్ల బాలికపై ఒక వ్యక్తి కొన్ని నెలలుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ఏడు నెలల గర్భవతి కావడంతో ఈ విషయాన్ని తట్టుకోలేక శనివారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. 15 రోజులు రిమాండ్ విధించడంతో నిందితుడ్ని జైలుకు తరలించినట్లు ఎస్ఐ దిలిప్ పాటిల్ తెలిపారు.