లక్నో : యూపీలో మహిళలు, చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజా ఘటనలో టీవీ చూసేందుకు తమ ఇంటికి వచ్చిన పొరుగింటి బాలిక (11)పై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన మొయిన్పురి జిల్లా కిష్ని ప్రాంతంలో మంగళవారం వెలుగుచూసింది.
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని బాలికను బెదిరించాడని పోలీసులు తెలిపారు. బాలిక తిరిగి వచ్చి జరిగిన విషయం తల్లికి చెప్పడంతో దారుణం బయటపడింది. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు తరలించిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.