అమరావతి : ప్రమాదవశాత్తు గ్యాస్లీకై ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన విషాద సంఘటన నెల్లూరు జిల్లాలోని చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలో చోటు చేసుకుంది . గ్రామానికి చెందిన అబ్బాస్ కుటుంబం ఆదివారం ఇంట్లో పడుకున్నారు. అర్ధరాత్రి సమయంలో గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. పొగ కమ్మేయడంతో పాటు తీవ్రంగా గాయపడ్డ అబ్బాస్, భార్య నౌషాద్లు అక్కడికక్కడే మృతి చెందారు.
తీవ్రంగా గాయపడ్డ కుమార్తె అయేషాను చికిత్సకోసం దవాఖానకు తరలించారు. చికిత్సపొందుతూ ఆమె కూడా మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు నెలకొని ఉన్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.