అమరావతి : విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలిపై ప్రియుడితో పాటు మరో ఇద్దరు లైంగికదాడికి పాల్పడ్డారు. ప్రియురాలు మానసిక స్థితి బాగలేదని ఇంటి నుంచి తీసుకెళ్లిన ప్రియుడు ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమె నోట్లో గుడ్డలు కుక్కి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు.
తమ కూతురు కనిపించడం లేదని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి నిందితుడి ఫోన్ నంబర్ ఇచ్చినా పోలీసులు స్పందించకపోవడంతోనే లైంగికదాడి జరిగిందని బాధితురాలి సోదరుడు వాపోయాడు. తమ సోదరికి ఎలాంటి మానసిక సమస్యలు లేవని తెలిపాడు. కాగా న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు.
బాధితుల ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితురాలిని పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.