హైదరాబాద్ : నకిలీ రబ్బర్ స్టాంపులు, సంతకాలతో ఫోర్జరీ చేస్తూ నకిలీ డాక్యుమెంట్లు తయారీ చేస్తున్న ముఠా సభ్యులను నగరంలోని కేపీహెచ్బీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 10 రబ్బర్ నోటరీ స్టాంపులు, 3 ల్యాప్ ట్యాప్లు, 5 మొబైల్ ఫోన్లు, 100 బాండ్ పేపర్లు, ఇతర నకిలీ, కల్పిత పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.