జోగుళాంబ గద్వాల : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి ఓ బాలుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మానవపాడు మండలం శ్రీనగర్ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. శ్రీనగర్ గ్రామానికి చెందిన మహేశ్కు కొడుకు నాలుగు సంవత్సరాల కొడుకు అజయ్ ఉన్నాడు. శాంతినగర్ శ్రీ రాఘవేంద్ర హైస్కూల్ లో చదువుతున్నాడు.
కాగా, బాలుడి తలపై నుంచి బస్సు ముందర వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.