ఇండోర్ : మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఇటీవల మసాజ్ పార్లర్లో సెక్స్ రాకెట్ నిర్వహిస్తూ పట్టుబడిన 18 మందిలో నలుగురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. స్పాపై జరిగిన దాడుల్లో పోలీసులు నలుగురు పురుషులతో పాటు ఎనిమిది మంది మహిళలను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా వారికి కరోన పరీక్షలు నిర్వహించాలని న్యాయస్ధానం ఆదేశించింది.
నిందితులకు జరిపిన కొవిడ్-19 పరీక్షల్లో ముగ్గురు మహిళలతో పాటు ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ ఫలితం వచ్చింది. దీంతో పోలీసుల బృందం, జైలు అధికారులు కూడా కరోనా పరీక్ష చేయించుకున్నారు. స్పాలో పట్టుబడిన నలుగురికి కొవిడ్-19 పాజిటివ్ రాగా జైలు అధికారులు, పోలీసుల శాంపిల్స్ను కూడా పరీక్షల నిమిత్తం పంపామని మహిళా పోలీస్ కానిస్టేబుల్ జ్యోతి శర్మ చెప్పారు.
ముందు జాగ్రత్త చర్యగా అధికారులు జైలు ప్రాంగణాన్ని శానిటైజ్ చేశారని తెలిపారు. విజయ్నగర్ ప్రాంతంలో వ్యభిచార రాకెట్ నడుస్తోందనే సమాచారంతో మూడురోజుల కిందట ఆ ప్రాంతంలోని స్పాపై పోలీసులు దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో ఎనిమిది మంది మహిళలు సహా 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.