హైదరాబాద్ : సరదాగా ఈతకు వెళ్లి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన వికారాబాద్ జిల్లాలో సోమవారం చోటు చేసుకున్నది. కోట్పల్లి ప్రాజెక్టులో మునిగి నలుగురు మృతి చెందారు. మృతులు పూడూరు మండలం మన్నెగూడ వాసులుగా గుర్తించారు. మృతులు లోకేశ్, వెంకటేశ్, జగదీశ్, రాజేశ్గా గుర్తించారు. ప్రాజెక్టులో నుంచి నలుగురి మృతదేహాలను స్థానికులు వెలికి తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉన్నది. వెంకటేశ్ ఎంబీఏ చేస్తుండగా, రాజేశ్ ప్రైవేటు ఉద్యోగి కాగి.. జగదీశ్ వ్యవసాయం చేస్తున్నాడు. పండగ సెలవు కావడంతో అందరు కలిసి సరదాగా ఈత కోసం ప్రాజెక్టులోకి వచ్చారు. క్రమంలోనే నీటిలో మునిగి మృతి చెందారు. పండుగ పూట నలుగురు మృతి చెందడంతో ఆయా కుటుంబాల్లో విషాదం అలుముకున్నది. మృతుల్లో లోకేశ్ జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్నాడు.